Thursday, April 25, 2024

తిరుపతి వద్ద భారతీయుడు-2 చిత్రీకరణలో కమల హాసన్ 

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం పి వి పురం పంచాయతీ గుండాల కోన (వాటర్ ఫాల్స్) వద్ద శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న భారతీయుడు-2 చిత్రం షూటింగ్ లో మహా నటుడు కమలహాసన్- పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఏడూ రోజులుగా షూటింగ్ జరుగుతోంది. 7వ రోజు చిత్రీకరణలో భాగంగా పరిసర ప్రాంతాల ప్రజలతో చిత్రీకరణ దృశ్యాలు చివరి ఘట్టం చిత్రీకరించారు. చిత్రీకరణలో భాగంగా తెల్ల దొరల అహంకారానికి భారతీయ బిడ్డలు తెల్లదొరల తుపాకీ తూటాలకు బలి… భర్తల చేతులను వెనుక వైపున తుపాకీ పెట్టి కట్టివేసి లాఠీలతో కొట్టే .. మహిళలను, చిన్నారులను ఇండ్ల నుంచి రోడ్డుపై పడవేయడంతో ఆర్తనాథాలతో తమ భర్తలను కాపాడండి… కాపాడండంటూ తమ నెత్తిన బాదుకుంటూ ఏడుపులతో వేడుకునే సన్నివేశాలు తీశారు… శుక్ర, శని వారాల్లో హీరో కమల్ హాసన్ మహిళలను ఓదార్చే సన్నివేశ చిత్రీకరణ, హీరోయిన్ కాజల్ అగర్వాల్ గుర్రపు స్వారీ సన్నివేశాలు, మహిళలు, చిన్నారుల ఆర్తనాదాలు… తెల్ల దొరలు పూరి గుడిసెలను తగలబెట్టే ఆఖరి ఘట్టం చిత్రీకరణ జరిగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement