Thursday, May 2, 2024

Kadiri: చిన్నారి ప్రాణం తీసిన వేరుశనగ విత్తనం.. నల్ల చెరువులో విషాదం

అనంతపురం, ఆగస్టు 16, ప్రభ న్యూస్ బ్యూరో : వేరుశనగ విత్తనం ఒక చిన్నారి ప్రాణాన్ని తీసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారి దొరికిన విత్తనాన్ని నోట్లో వేసుకుంది. రెండు సంవత్సరాలకే 100 సంవత్సరాల జీవితం ముగిసిపోయింది. శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రంలో సంఘటన జరిగింది.

వివరాలలోకి వెళితే… బీసీ కాలనీకి చెందిన హనుమంతు కూతురు నయనశ్రీ అనే రెండు సంవత్సరాల చిన్నారి ఇంటి ముందర ఆడుకుంటుండగా వేరుశనగ విత్తనం గొంతులో ఇరుకోవడంతో ఊపిరాడక ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన రుజువు చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement