Sunday, April 28, 2024

ఇద్దరు ఎర్రచందనం దొంగల అరెస్ట్‌

కడప : వైఎస్సార్ జిల్లా సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా ఎర్ర చందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చెశారు. వీరి వద్ద నుంచి 20 ఎర్ర చందనం దుంగలు, ఒక మోటార్ సైకిల్ వాహనం, రెండు గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ వివ‌రాలు వెలడించారు. ఎర్ర చందనం అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని ఎస్పీ వెల్లడించారు. ఇన్ చార్జి ఓఎస్డి చెంచు బాబు, టాస్క్ ఫోర్స్ సీఐ నాగ భూషణం, ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజు, ఎస్సై తులసి నాగ ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement