Friday, April 26, 2024

రెండు బైక్ లు ఢీకొని.. ముగ్గురు యువకుల మృతి

కడప : కడప నగరంలో ఘోర రోడ్డుప్రమాదం ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. కడప రిమ్స్ ప్రధాన రహదారిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బైక్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు.

ఇందులో ఇద్దరు కడప హోమియో వైద్య కళాశాలలో బీహెచ్ఎంఎస్ చదువుతున్నారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బైక్ లు వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బీహెచ్ఎంఎస్ చదువుతున్న కడపకు చెందిన నిత్య సాయి, ప్రొద్దుటూరుకు చెందిన జాఫర్ బాషా, నెల్లూరుకు చెందిన భవానీ శంకర్ మృతిచెందారు. మరో యువకుడు హుస్సేన్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement