Friday, April 26, 2024

ప్రొద్దుటూరులో త‌ల్లి,తోబుట్టువులు హ‌త్య‌…

కడప జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లితోపాటు తోబుట్టువులను హత్యచేశాడో కిరాతకుడు. ప్రొద్దుటూరు టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని హైదర్‌ఖాన్‌ వీధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ప్రొద్దుటూరుకు చెందిన కరీముల్లా త‌న‌ తల్లి, చెల్లి, తమ్ముడిని కిరాతకంగా చంపేశాడు. ఇంటి పెద్ద కుమారుడు కరీముల్లాకు తన భార్యతో వివాదం ఉంది. ఈ విషయంలో తల్లి, చెల్లి, తమ్ముడు సహకరించాలంటూ కొద్ది రోజులుగా ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున తల్లి ఇంటికి వచ్చిన కరీముల్లా.. నిద్రిస్తున్న తల్లి గుల్జార్ బేగం, తమ్ముడు మహమ్మద్ రఫీ, చెల్లెలు కరీమున్నీసాలను రోకలి బండతో దారుణంగా హతమార్చాడు. అనంతరం తెల్లవారుజామున కరీముల్లా నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement