Thursday, April 25, 2024

మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా ఉమాదేవి..

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా ఎం.ఉమాదేవి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ శాఖ కమీషనర్‌ దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం బెల్లంపల్లి ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ సీడీపీఓగా ఉమాదేవి విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా ఉన్న రవూఫ్‌ ఖాన్‌ సస్పెండ్‌ కావడంతో ఆయన స్థానంలో ఉమాదేవి నియమితులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement