Monday, April 29, 2024

కుమారుడు లేని జీవితం మాకొద్దని.. దంపతుల బలవన్మరణం..

బి.కొత్తకోట, (కడప) ప్రభన్యూస్‌: :కుమారుడు లేని జీవితం మాకొద్దని దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బి.కొత్తకోట మండలంలో చోటు-చేసుకొంది. వివరాలలోకి వెళ్తే ముదివేడు ఎస్సై సుకుమార్‌ కథనం మేరకు కురబలకోట మండలం వినాయక చేనేత నగర్‌లో నివసిస్తున్న దంపతులు వై.కృష్ణ (50),వై.రమణ(44)కు సురేష్‌,సుప్రియ అనే పిల్లలు. కుమార్తె సుప్రియకు అదే చేనేత నగర్‌లో నివసిస్తున్న అతనికి ఇచ్చి పెళ్లి చెయ్యగా, కుమారుడు బెంగళూర్‌లో సాప్ట్‌nవేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కుమారుడు సురేష్‌ ఆర్నెల్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి మనో వేదనతో బ్రతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో వారి కుమార్తె ఇంటిలోకి వెళ్లి చూడగా ఆమెకు సూసైడ్‌ నోట్‌ కనిపించింది.

తమ కుమారుడు మృతి చెందినప్పటి నుంచి మనోవేదనకు గురయ్యమని, తాము ఎవ్వరినీ బాధ పెట్టదలుచు కోలేదని తమ చావుకు ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులు సంతకాలతో రాసిన లెటర్‌ పేర్కొన్నారు. వెంటనే కుటు-ంబ సభ్యులతో కలిసి చుట్టు-పక్కల వెతికినా ఎక్కడా కనపడకపోవడంతో ముదివేడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. కాగా మంగళవారం బి.కొత్తకోట మండలంలోని బయ్యప్పగారి పల్లి సమీపంలోని హార్సిలీ హిల్స్‌ కింద సిరికల్చర్‌ ఫార్మ్‌ హౌస్‌ వెనుకవైపు గొర్రెల కాపరులకు ఇద్దరు చెట్టు-కు ఉరివేసుకొని చనిపోయినట్లు- కనపడడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి ముదివేడు ఎస్సై తన సిబ్బందితో అక్కడికి చేరుకొని అవి కృష్ణ, రమణమ్మ మృతదేహాలుగా నిర్ధారించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement