Sunday, May 5, 2024

వారం రోజుల్లో కబడ్డీ మైదానం సిద్ధం : ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి

తిరుపతి : వారం రోజుల్లో కబడ్డీ మైదానం, గ్యాలరీ నిర్మాణ పనులను పూర్తి చేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తుడా ఇందిరా మైదానంలో జరుగుతున్న నిర్మాణ పనులను ఇవాళ‌ ఉదయం పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే అధికారులకు, కాంట్రాక్టర్లకు తగిన సూచనలిచ్చారు. వచ్చే నెల ఐదో తేదీ నుంచి కబడ్డీ పోటీలు జరగనున్న కారణంగా…త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement