Friday, May 3, 2024

AP : మార్చి రెండున టిడిపిలో చేరుతున్నా – ఎంపీ లావు

మార్చి 2న దాచేపల్లిలో జరగబోయే ‘రా కదలిరా’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్ల‌డించారు. ప్రజా సంక్షేమం, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నానని తెలిపారు. త‌న‌ను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నానని ఆయ‌న ట్వీట్ చేశారు.

వైసీపీ అధినాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను బదిలీ ల‌లో భాగంగా నరసరావుపేట సీటు ను లావును ఎంపిక‌పై అనుమానాలు వ్య‌క్తం కావ‌డంతో లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. అనంత‌రం నరసరావుపేట ఎంపీ స్థానం ఇన్చార్జిగా అనిల్ కుమార్ యాదవ్ పేరును వైసీపీ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement