Thursday, April 25, 2024

జ‌న‌సేన‌లో చేరిన ప‌లువురు.. వైసీపీ నేత‌లు

జ‌న‌సేన‌లో చేరారు ప‌లువురు వైసీపీ నేత‌లు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జ‌న‌సేన అధినేత పవన్ క‌ల్యాణ్ సమక్షంలో పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన బొంతు రాజేశ్వరరావు, విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గురాన అయ్యలు, పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఏఎంసీ చైర్మన్ కొమ్మూరి కొండలరావు జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

వీరికి పవన్ కల్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ సర్కారుకు సలహాదారుగానూ వ్యవహరించారు. రాజేశ్వరరావుతో పాటు ఆయన అనుచరులు కూడా జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement