Sunday, April 28, 2024

రోజా ఇంటి ముట్టడికి జనసేన యత్నం.. పలువురు నాయకుల హౌస్​ అరెస్టు

ఏపీలోని చిత్తూరు జిల్లాలో రాజకీయ వేడి నెలకొంది. వైఎస్సార్​సీపీ లీడర్​, నగర ఎమ్మెల్యే.. మంత్రి రోజాకు జనసేన లీడర్లకు మధ్య వార్​ నడుస్తోంది. జనసేన పార్టీని కించపరిచేలా మాట్లాడిన రోజా క్షమాపణ చెప్పాలని, లేకుంటే తన ఇంటిని ముట్టడిస్తామని జనసేన కార్యకర్తలు, లీడర్లు పెద్ద ఎత్తున రోజా ఇంటి ముట్టడికి బయలు దేరారు. ఈ క్రమంలో తిరుపతిలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఉదయం 6 గంటల నుంచే చాలా మంది లీడర్లను హౌస్​ అరెస్టు చేశారు. బైరాగిపట్టెడలో జనసేన ఇన్​చార్జి కిరణ్​ రాయల్​ హౌస్​ అరెస్టు చేశారు. ఇంకొతమంది లీడర్లను కూడా పోలీసులు కట్టడి చేశారు. ఇక.. పవన్​ కల్యాణ్​పై రోజా చేసిన విమర్శలకు వీరమహిళలు కౌంటర్​ ఇస్తున్నారు. అభివృద్ధి అంటే ఏంటో నగరి వచ్చి తెలుసుకోవాని రోజా సవాల్​ చేయగా.. నగరి వెళ్లేందుకు చాలామంది జనసైనికులు రెడీ అయ్యారు. నగరిని దోచుకుంటోంది ఎవరో చూపిస్తామని జనసేన లీడర్లు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement