Friday, May 3, 2024

Jana Senani – వాలంటీర్ వ్య‌వ‌స్థ‌పై కోర్టుకు వెళ్ల‌నున్న జ‌న‌సేన …

అమ‌రావ‌తి – ఎపిలోని వాలంటీర్ వ్య‌వ‌స్థ‌పై హైకోర్టును జ‌న‌సేన ఆశ్ర‌యించ‌నున్న‌ది.. ఈ మేర‌కు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట్ట‌ర్ ద్వారా నేడు తెలియ‌జేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు కాని వ్య‌క్తుల ద్వారా ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త డేటాను సేక‌రిస్తున్న‌ద‌నేది జ‌న‌సేన ప్ర‌ధాన అభ్యంత‌రం.. అలాగే చాలా ప్రాంతాల‌లో వాలంటీర్లు త‌మ హోదాను దుర్వ‌నియోగం చేస్తున్నారంటూ ప‌వ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు.. అయితే వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా స‌మ‌ర్ధిస్తున్నారు.. వారిపై వ‌స్తున్న‌వ‌న్నీ ఆరోప‌ణ‌లేన‌ని కొట్టి ప‌డేస్తున్నారు..

ఇది ఇలా ఉంటే నేడు జ‌గ‌న్ కు ప‌వ‌న్ మ‌రో మూడు ప్ర‌శ్న‌లు సంధించారు.. వాటికి స‌మాధానం చెప్పాంటూ డిమాండ్ చేశారు..‘‘అందరి ఆందోళన ఒక్కటే.. మై డియర్ వాట్సన్! మీరు సీఎం అయినా, కాకపోయినా డేటా గోప్యత చట్టాలు అలాగే ఉంటాయి. కాబట్టి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. 1.వాలంటీర్ల బాస్‌ ఎవరు?
2.ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు? 3.వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు?” అని జగన్‌ను పవన్‌ ప్రశ్నించారు. ‘‘వ్యక్తిగత సమాచారం ఎవరైనా ప్రైవేటు వ్యక్తి దగ్గర ఉంటే అది క్రైమ్’’ అంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను షేర్ చేశారు. అలాగే క్రూడ్రాయిల్ ఎంత విలువైన‌దో డేటా కూడా అంతే విలువైన‌ది అంటూ ట్విట్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement