Monday, April 29, 2024

Jana Senani – అయోధ్య రామ‌య్య కోసం ఏదైనా చేస్తా – ప‌వ‌న్ క‌ల్యాణ్ …

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు తాను భావోద్వేగానికి గురయ్యానని, ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో తన కళ్ల నుంచి నీళ్ళు వచ్చాయని అన్నారు. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింతగా పెంచిందని తెలిపారు. అయోధ్యలో రాముడి మందిరం కోసం కొన్ని తరాలుగా, కొన్ని శతాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయని, ఇప్పుడు వారందరికీ ఆశయం నెరవేరిందని తెలిపారు.

ఇది ఒక రకంగా దేశాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే.. సాధారణంగా తాము రాముడు, బాలాజీ కోసం తిరుమలకు వెళ్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక పై రాముడి కోసం అయోధ్యకు వస్తారని తెలిపారు. ముఖ్యంగా దక్షిణాది నుంచి అయోధ్యకు ఎక్కువ మంది వస్తారని పేర్కొన్నారు. తనకు అయోధ్య కోసం ఏదైనా చేయాలని ఉన్నదని, రానున్న రోజుల్లో ఏదో ఒకటి చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement