Friday, May 3, 2024

Jana Sena – కాకినాడలో పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో రెండో రోజు పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ అమలాపురం పార్లమెంట్ కు చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కో- ఆర్డినేటర్లతో ఆయన మాట్లాడనున్నారు. కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని పవన్ ను పలువురు నేతలు కోరుతున్నారు. పార్టీలో చర్చించి అవకాశాలను బట్టి పరిశీలిద్దామని జనసేనాని చీఫ్ చెప్పారు. గతంలో వారాహి యాత్ర సందర్భంగా జరిగిన సవాళ్ళలలో దమ్ముంటే తనపై పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ కి ద్వారంపూడి చంద్రశేఖర్ సవాలు చేశారు.. ఆ సవాల్ ను స్వీకరించి పోటీ చేస్తే పార్టీకి మైలేజ్ కూడా ఉంటుందని పవన్ దగ్గర పలువురు నేతలు ప్రస్తావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement