Friday, April 26, 2024

ఆగస్ట్‌ 16నే స్కూళ్లు ప్రారంభం.. జగనన్న విద్యాకానుక ఇస్తాం: మంత్రి సురేష్

ఆంధ్రప్రదేశ్ లో ఆగస్ట్‌ 16న స్కూళ్లు పున:ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. అదే రోజు జగనన్న విద్యాకానుక ఇస్తామని వెల్లడించారు. విద్యాకానుకలో ఈసారి డిక్షనరీ కూడా ఇస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల స్కూళ్లను నాడు-నేడు కింద అభివృద్ధి చేశామని చెప్పారు. మొదటి దశ నాడు-నేడును ప్రజలకు అంకితం చేస్తామన్నారు. అదే రోజు రెండో విడత నాడు-నేడు పనులను కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. స్కూళ్లు ప్రారంభించేలోపు టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని మంత్రి సురేష్‌ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement