Thursday, April 18, 2024

టోక్యో ఒలింపిక్స్ లో మేరీ కోమ్ కథ ముగిసింది..

ఇండియ‌న్ స్టార్ బాక్స‌ర్, ఆరుసార్లు వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌ మేరీ కోమ్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. మొదటి నుంచి మేరీ కోమ్ మెడల్ తీసుకువస్తుందని అందరూ భావించారు..కాని కొలంబియాకు చెందిన ఇన్‌గ్రిట్ విక్టోరియా చేతిలో 2-3 తేడాతో మేరీ కోమ్ ఓడిపోయింది. తొలి రౌండ్‌లోనే విక్టోరియా ఎదురుదాడికి దిగ‌డంతో మేరీ కోమ్‌కు కోలుకునే అవ‌కాశం ద‌క్క‌లేదు. మెడ‌ల్‌పై ఆశ‌లు రేపిన ఆమె రౌండ్ ఆఫ్ 16లోనే ఇంటిదారి ప‌ట్టింది. తొలి రౌండ్‌లో న‌లుగురు జ‌డ్జీలు విక్టోరియాకు 10 స్కోరు ఇచ్చారు. అయితే రెండో రౌండ్‌లో మేరీ పుంజుకొని ప్ర‌త్య‌ర్థిపై పైచేయి సాధించింది. కీల‌క‌మైన మూడో రౌండ్‌లో మ‌రోసారి విక్టోరియా ఎదురుదాడికి దిగడంతో మేరీ కోమ్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు

ఇది కూడా చదవండి: ఆగస్ట్‌ 16నే స్కూళ్లు ప్రారంభం.. జగనన్న విద్యాకానుక ఇస్తాం: మంత్రి సురేష్

Advertisement

తాజా వార్తలు

Advertisement