Friday, April 19, 2024

ఏపీలో ఈ నెల 31 నుంచి సినిమా హాళ్లు ఓపెన్

ఏపీలో ఈ నెల 31 నుంచి థియేటర్లు ఓపెన్ కానున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో సినిమా హాళ్లు మూసివేశారు. కాగా ఇప్పటికే తెలంగాణలో రేపటి నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ నెల 31 నుంచి సినిమా థియేటర్లలో ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది. అయితే, 50 శాతం సీటింగ్ తోనే ప్రదర్శనలు జరుపుకోవాలని స్పష్టం చేసింది. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం వంటి కరోనా మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. ఇటీవల కర్ఫ్యూ సమయాల సడలింపులు ఇచ్చే సందర్భంలోనే థియేటర్ల రీ ఓపెనింగ్ కు సర్కారు పచ్చజెండా ఊపింది. అయితే, నిర్మాతలతో ఎగ్జిబిటర్ల వివాదం ఓ కొలిక్కిరాకపోవడంతో థియేటర్లు తెరుచుకోవడం ఆలస్యమైంది. కాగా, 50 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనలు తమకు లాభదాయకం కాదని థియేటర్ల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: నన్ను ఓడగొట్టే దమ్ములేక చిల్లర రాజకీయాలు: ఈటల

Advertisement

తాజా వార్తలు

Advertisement