Sunday, April 28, 2024

జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను స‌ద్వినియోగం చేసుకోవాలి.. మంత్రి రోజా

క్రీడలకు సంబంధించి పలు ప్రయోజనాలు అందివ్వనున్న జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ క్రీడలు, యువజన సర్వీసు శాఖల మంత్రి ఆర్‌కే రోజా సూచించారు. ఏపీ సచివాలయంలో శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డితోపాటు పలువురు క్రీడా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి రోజా జగనన్న స్పోర్ట్స్ యాప్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని క్రీడాకారులకు అండగా ఉంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటేలా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను తీసుకువచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహంగా ఉంటుందని తెలిపారు. ఈ యాప్‌ను విస్తృతంగా ప్రచారం చేసి రాష్ట్రంలోని అన్ని క్రీడా సంఘాలకు చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్‌, శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement