Monday, April 29, 2024

అసత్య ప్రచారాలు చేయడం సరైంది కాదు.. మంత్రి అమర్నాథ్

రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరిలిపోతున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది సరైంది కాదని ఏపీ మంత్రి గుడవాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… పరిశ్రమలు వస్తే ఉపాధి లభిస్తుంది. రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుందన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అమర్ రాజా ప్రతినిధులు ఎక్కడైనా చెప్పారా అని ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చెందిన హెరిటెజ్ వ్యాపారం ఏపీలోనే ఉందన్న ఆయన చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందా అని అడిగారు. ఏపీలో ఏ పరిశ్రమనూ రాజకీయ కోణంలో చూడలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement