Monday, May 6, 2024

Breaking: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్సే… గిడుగు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో ఏపీలో పెను మార్పులు వస్తాయన్నారు.

ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వచ్చే అవకాశముందన్నారు. షర్మిల వస్తే ఆహ్వానిస్తామన్నారు. త్వరలో ఏపీలో రాహుల్, ప్రియాంక పర్యటిస్తారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్, అమరావతి రాజధాని ఉద్యమానికి ప్రియాంక మద్దతిస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement