Wednesday, May 1, 2024

Follow up | 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. 17 నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు

అమరావతి, ఆంధ్రప్రభ: డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలోని 41 స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీల్లో 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసింది. డైరెక్ట్‌, లేటరల్‌ ఎంట్రీ విధానంలో ఈపోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఈనెల 17 నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ డీఎంఈ డాట్‌ ఏపీ డాట్‌ ఎన్‌ఐసీ డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ అందుబాటులోకి రానుంది. ఈనెల 26వ తేదీ దరఖాస్తును చివరి గడువుగా.

నిర్ణయించారు. ఓసీ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్‌ వికలాంగ అభ్యర్థులు రూ.500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త మెడికల్‌ కళాశాలల్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. నూతనంగా ఏర్పాటు చేసిన కడప మాససిక ఆసుపత్రి, పలాస కిడ్నీ రిసెర్చ్‌ సెంటర్‌తో పాటు పలు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి అనుమతులు లభించాయి. ఈక్రమంలో ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement