Monday, April 29, 2024

అంతర్‌ జిల్లాల బదిలీల ఉత్తర్వులు విడుదల..

అమరావతి, ప్రభన్యూస్ : రాష్ట్రంలో ఉపాధ్యాయుల అంతర్‌ జిల్లాల బదిలీకి అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ విడుదల చేసిన జీవోలో మొత్తం 527 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 187 మంది స్పౌజ్‌, 340 మంది టీచర్స్‌ మ్యూచువల్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు, కె.కులశేఖర రెడ్డి కొన్ని నెలలుగా ఉపాధ్యాయుల అంతర్‌ జిల్లా బదిలీల కోసం ఎదురు చూస్తున్నామని, తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ అన్ని జిల్లాలకు తగు సూచనలతో కూడిన ఉత్తర్వు జారీ చేయాల్సి ఉందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement