Thursday, April 25, 2024

నగరం మునగకుండా అభయం.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మంత్రి కేటీఆర్ హామీ

జనగామ, ప్రభన్యూస్ : వర్షాకాలం వచ్చిందంటే వరదలతో జనగామ నగరం మునిగిపోతుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. వరంగల్ పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తున్న కేటీఆర్ కి జనగామ పట్టణం వర్షాకాలంలో మునుగుతుంది అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివరించి నడిరోడ్డు పైనే రాత్రి 9 గంటలకు వినతి పత్రాన్ని అందజేశారు. నిధులు మంజూరు చేస్తానని మంత్రి అభయమిచ్చారు. ఏ సమయంలోనైనా ప్రజా సమస్యలు పట్టించుకునే మంత్రిగా కేటీఆర్ మరోసారి తన మార్కును చాటుకున్నారు. జనగామ ప్రజల పక్షాన కేటీఆర్ కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement