Monday, April 29, 2024

Inspection – శ్రీశైలం చేరుకున్న డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం…

శ్రీశైల జలాశయ జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం బుధవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. . శ్రీశైలం ప్రాజెక్టులోని ఏపీ జెన్కో అతిథి గృహం వద్దకు బృందం సభ్యులు చేరుకోగా,అతిథి గృహం వద్ద డ్యామ్ ఎస్ఈ శ్రీరామ చంద్రమూర్తి, పలువురు ఇంజనీర్లు స్వాగతం పలికారు

.శ్రీశైల డ్యాంను కెఆర్ఎంబి పరిధిలోకి తీసుకురానున్న నేపథ్యంలో పలు అంశాలపై వారు రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం శ్రీశైల జలాశయం ను వారు పరిశీలించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement