Tuesday, May 14, 2024

అమెరికాకు గోధుమలు ఎగుమతి చేసే స్థాయికి భారత్‌.. ఎంపి విజయసాయిరెడ్డి

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో : భారత్‌ అమెరికా నుండి 1964-69 మధ్యకాలంలో పిఎస్‌-480 పేరుతో గోధుమలు సాయంగా పొందితే, ఇప్పుడు ఆ దేశానికి బియం, గోధుమలు ఎగుమతి చేస్తున్నామని రాజ్యసభ సభ్యులు, వైఎస్‌ఆర్‌ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లకుండా చూసేందుకు భారత ప్రభుత్వం గత ఎడాది గోధుమల ఎగుమతిపై నిషేధం విధించిందని చెప్పారు. 2022 సెప్టెంబరులో బియ్యం, నూకల ఎగుమతి పూర్తి నిషేధంతో పాటు కేంద్ర సర్కారు ఇతర రకాల తెల్ల బియ్యంపై 20 శాతం ఎగుమతి పన్ను విధించిందని చెప్పారు. గత సంవత్సరం వరి పండించే రాష్ట్రాల్ల్రో తగినంత వర్షపాతం లేకపోవడం, ఇతర సమస్యల కారణంగా దేశంలో బియ్యం ధరలు పెరగకుండా నిరోధించడానికి కేంద్రం ఈ చర్యలు తీసుకుందన్నారు.

- Advertisement -

ఈ ఏడాది బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని తొలగించే అవకాశం లేదని, మొన్న ఫిబ్రవరిలో ప్రభుత్వ వర్గాలు తెలిపాయన్నారు. అలాగే 2023-2024 సంవత్సరంలో దేశంలో గోధుమల ఉత్పత్తి పెరుగుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ ఈ ధాన్యం, గోధుమ ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఈ ఏడాది మార్కెటింగ్‌ సీజన్‌ గడిచే వరకూ ఇండియా తొలగించకపోవచ్చని కూడా అమెరికా వ్యవసాయ శాఖలోని విదేశీ వ్యవసాయ సేవల విభాగం అంచనా వేసిందని చెప్పారు.

గోధుమలను పెద్ద మొత్తాల్లో ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థితికి నేడు చేరుకోవడం దేశం సాధించిన గొప్ప విజయామని కోనియాడారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్‌ ప్రజలకు సరఫరా చేయాల్సిన ఆహారధాన్యాలను బ్రిటిష్‌ సేనల కోసం నాటి ఇంగ్లండ్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ ఆదేశాల ప్రకారం తరలించడంతో 1943లో బెంగాల్‌లో కరువు వచ్చి లక్షలాది జనం మరణించారని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement