Friday, April 26, 2024

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు.. మంత్రి జయరామ్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… నారా లోకేష్‌ మాటలు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు అట్టడుగు వర్గాలకు గౌరవం దక్కలేదని, సీఎం జగన్ వారికి పెద్దపీట వేశారన్నారు. 2024 ఎన్నికల్లోనూ వైసీపీదే విజయమని, అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్‌స్వీప్ చేస్తామని మంత్రి జయరామ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement