Thursday, April 25, 2024

ఫిష్ ఆంధ్ర షాపులు నిర్మాణానికి స్ధలం పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే

తాడేపల్లి,ఫిబ్రవరి22(ప్రభ న్యూస్) తాడేపల్లి సీతానగరం బ్యారేజీ దిగువన, ఉండవల్లి సెంటర్ లో ఫిష్ ఆంధ్ర షాపులను నిర్మించేందుకు స్ధలాన్ని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి యంటియంసి అధికారులతో కలిసి బుధవారం ఉదయం వేకువజామునపరామర్శించారు. సీతానగరం ప్రాంతంలో పుష్కర్ ఘాట్ పవిత్ర కృష్ణా నది వద్ద అపరికర్మలు నిర్వహించుకునే వారికి ఇబ్బందులు లేకుండా ఒక షేడ్డు నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారులకు ఎమ్మెల్యే ఆర్కే సూచనలు చేశారు.


పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద నిద్ర చేయడానికి వచ్చే భక్తులకు రాత్రి సమయంలో వసతి కల్పించడానికి దేవస్థానం దగ్గర ఉన్న కార్పొరేషన్ బిల్డింగును నామినల్ ఫీజుతో భక్తులకు అద్దెకి ఇవ్వటానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులను కోరారు. అనంతరం ఫిష్ ఆంధ్ర షాపును ఉండవల్లి సెంటర్ నందు ఏర్పాటు చేయడానికి కార్పొరేషన్ మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారితో కలిసి స్థల పరిశీలన చేశారు.ఈ కార్యక్రమంలో డీఈ కృష్ణ రెడ్డి,
వైసిపి పట్టణ కన్వీనర్ బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement