Monday, April 29, 2024

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..భార్య, ప్రియుడిని కడతేర్చిన భర్త

హోళగుంద మండలం కోగిలతోట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి. కోగిలతోట గ్రామంకు చెందిన గాయత్రి, శ్రీనివాసులు భార్య భర్తలు, అయితే గాయత్రికి అదే గ్రామానికి చెందిన హనుమప్ప తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.కాగా గురువారం రాత్రి భర్త శ్రీనివాసులు పనిపై బయటికి వెళ్లగా, అదే సమయంలో గాయత్రి , హనుమప్ప తో కలిసి ఇంట్లో ఉంది. ఇంటికి వచ్చిన భర్త శ్రీనివాసులు ఇరువురిని చూసి షాక్ గురయ్యాడు. ఆ తర్వాత పదునైన ఆయుధంతో భార్య గాయత్రి తో పాటు, హనుమప్పను అక్కడికక్కడే కడతేర్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement