Monday, May 6, 2024

తిరుమల శ్రీవారికి భక్తురాలి భారీ విరాళం.. ఎంత ఇచ్చారో తెలుసా!

తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందచేశారు చెన్నైకి చెందిన ఓ భక్తురాలు. దాదాపు 2.45 కోట్ల రూపాయల విలువజేసే 4 కిలోల బంగారాన్ని శ్రీవారికి విరాళంగా ఇచ్చి ఏడుకొండల స్వామిపై తనకున్న భక్తిని చాటుకున్నారు సరోజా సూర్యనారాయణ అనే భక్తురాలు. వజ్రాలు అమర్చిన 4 వేల 150 గ్రాముల బంగారం యజ్ఞోపవీతం, లక్ష్మీ కాసుల హారాన్ని స్వామివారికి కానుకగా సమర్పించారు. చైన్నై నగరంలో రూ.3.50 కోట్లు విలువజేసే తన స్థలాన్ని కూడా విరాళంగా అందజేశారు సరోజా. ఇక.. శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలను అందించారు ఈ భక్తురాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement