Friday, May 3, 2024

కారును ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి.. పరిగిలో ఘటన

వికారాబాద్‌ జిల్లాలోని పరిగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రంగంపల్లి వద్ద ఇవ్వాల (శుక్రవారం) తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్​కి తరలించారు. మృతుడిని సుదర్శన్‌ రెడ్డిగా గుర్తించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement