Monday, April 29, 2024

లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడిన హౌసింగ్ ఏఈ

హౌసింగ్ ఏఈ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తెర్గాం హౌసింగ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. దీంతో అధికారులు తెర్గాం హౌసింగ్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement