Saturday, May 4, 2024

కొత్తపల్లిలో భారీగా పోలీసులు.. గంజి ప్రసాద్ కుటుంబానికి హోం మంత్రి పరామర్శ

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లిలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పర్యటించనున్నారు. నిన్న దారుణ హత్యకు గురయిన వైసీపీ నేత గంజి ప్రసాద్ కుటుంబాన్ని హోం మంత్రి వనిత పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎనిమిది పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.

మరోవైపు జి.కొత్తపల్లిలో రెండు వారాలపాటు 144 సెక్షన్ విధించారు. గ్రామంలో 8 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 150 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement