Friday, April 26, 2024

నేడు సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదంపై విచార‌ణ

సుప్రీంకోర్టులో ఈరోజు కృష్ణా జలాల వివాదంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ వాదనలు వినిపించనున్నాయి. నిన్న కర్నాటక ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. నదిపై వేల కోట్ల ప్రాజెక్ట్ లు చేపట్టినందుకు ట్రిబ్యునల్ అవార్డును అమలు చేయాలని కర్ణాటక తరపు న్యాయవాదులు కోరారు. కృష్ణానది జలాలపై 13 వేల కోట్లతో కర్నాటక అక్రమంగా ప్రాజెక్ట్ లు చేపడుతుందని దానికి అనుగుణంగా నీటి కేటాయింపులు జరపాలని కర్నాటక కోరుతుందని తెలంగాణ ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. అంతేకాక అవార్డు అమలు నిలిపివేయాలని కూడా తెలంగాణ, ఏపీ న్యాయవాదులు, ధర్మాసనాన్ని కోరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement