Friday, March 29, 2024

ప్ర‌మాద‌వ‌శాత్తు లోయ‌లో ప‌డి ప్రాణాలు కోల్పొయిన సైనికులు

విధుల్లో భాగంగా కాప‌లా కాస్తోన్న ముగ్గురు సైనికులు ప్ర‌మాద‌వ‌శాత్తు లోయ‌లో ప‌డి ప్రాణాలు కోల్పొయారు. ఈ సంఘ‌ట‌న జ‌మ్మూకాశ్మీర్ లో చోటు చేసుకుంది. నార్త్ కశ్మీర్ లోని కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు ఈ ప్రమాదంలో క‌న్నుమూశారు. ఫార్వార్డ్ ఏరియాలో ఈ ముగ్గురూ విధులు నిర్వహిస్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో పట్టుతప్పి వాళ్లు ముగ్గురూ లోయలో పడిపోయారని చెప్పారు. వారికోసం గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు దొరికాయని చీనార్ కోర్ కు చెందిన అధికారులు వివరించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికులు, అధికారి ఎవరనే వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement