Monday, April 29, 2024

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

తెలుగుదేశం పార్టీ నేత‌ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో చనిపోయారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కొన‌సాగుతున్న పాదయాత్రలో హెడ్ కానిస్టేబుల్ రమేష్ కుప్పకూలాడు. సహచర పోలీసుల సహాయంతో అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement