Friday, May 3, 2024

శ్రీవారి సేవలో మంత్రి హరీశ్ రావు దంపతులు

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారి సుప్రభాత సేవలో హరీశ్ రావు దంపతులు సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

మంత్రి హరీష్ రావుతో పాటుగా తెలంగాణ ఎంపీ పార్థసారథి, తెలంగాణ పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, జాతీయ బీసీ వెల్ఫేర్ చైర్మన్ హన్సరాజ్ గంగారాంలు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement