Thursday, April 25, 2024

గుంటూరు జిల్లాలో సైకో వీరంగం.. ఇద్దరు చిన్నారుల దారుణహత్య

గుంటూరు జిల్లా రేపల్లెలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులను వరసకు బాబాయి అయిన కాటూరి శ్రీనివాసరావు అనే సైకో ఇంట్లో తలుపులు వేసి కర్రతో చితకబాది అతి దారుణంగా హత్య చేశాడు. రేపల్లె నేతాజీ నగర్‌లో నివాసం ఉంటున్న అమ్మమ్మ వద్దకు చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన కొండేటి కోటేశ్వరరావు ఉమాదేవి దంపతుల ఇద్దరు కుమారులు పార్థివ్ సాహసవత్ (10), రోహిత్ తశ్విన్ (8) అనే ఇద్దరు పిల్లలను ఉమాదేవి చెల్లెలి భర్త అయిన కాటూరి శ్రీనివాసరావు అతి దారుణంగా హత్య చేశాడు. కొండేటి కోటేశ్వరరావు ఉమాదేవి బెంగళూరులో ఉద్యోగం చేస్తోందది. లాక్ డౌన్ కారణంగా పిల్లలు రేపల్లెలోని అమ్మమ్మ మోర్ల విజయలక్ష్మి వద్ద ఉంటున్నారు. హత్య చేసిన వ్యక్తి కర్లపాలెం గ్రామానికి చెందిన కాటూరి శ్రీనివాసరావు తనంతట తానే పోలీసులు ఎదుట లొంగిపోయాడు. నిందితుడు చాలాకాలంగా మానసిక పరిస్థితి సరిగా ఉండడంలేదు.

ఇది కూడా చదవండి: తిరుపతి సూట్‌కేస్ మర్డర్‌లో కీలక ఆధారాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement