Thursday, May 9, 2024

జగన్‌ మేనిఫెస్టోలో మూడు రాజధానులు ఎక్కడా లేదు : సీపీఐ నేత నారాయణ

ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన మేనిఫెస్టోలో మూడు రాజ‌దాలు అని ఎక్క‌డా లేద‌ని సీపీఐ నేత నారాయ‌ణ అన్నారు. అమ‌రావ‌తి రైతుల మ‌హా పాద‌యాత్ర పోరాటంలో ఏ రాజకీయ పార్టీవారు లేరని, రాజధాని కోసం రైతులే పాదయాత్ర చేస్తున్నారని ఆయ‌న స్పష్టం చేశారు. అమ‌రావ‌తి రైతుల యాత్రపై సీఎం జ‌గ‌న్‌ ఆదేశాలతోనే మంత్రులు కారు కూతలు కూస్తున్నారని, రైతుల యాత్ర‌ను అడ్డుకునేందుకు కుట్ర ప‌న్నుతున్నార‌ని మండిపడ్డారు. రాష్ట్ర‌ ప్రభుత్వమే సివిల్ వార్ సృష్టించి అరాచకం చేయాలని చూస్తోందని ఆరోపించారు. జగన్‌ మేనిఫెస్టోలో మూడు రాజధానులని ఎక్కడా అనలేదని తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా ఒకరిద్దరు రాజీనామా చేయడం కాదని… అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామని నారాయణ సవాల్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement