Wednesday, May 8, 2024

భక్తిశ్రద్ధలతో సహస్ర దీపాలంకరణ

గుంటూరు కల్చరల్, ఆర్ అగ్రహారం శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో సహస్ర దీపాలంకరణ అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. స్థానిక ఆర్ అగ్రహారంలో శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు మద్దాళి రామమోహనరావు, వెంకటలక్ష్మీఅన్నపూర్ణ దంపతుల ఆద్వర్యంలో జరుగుతున్న 25వ వార్షిక బ్రహ్మోత్సవాలలో సోమవారం భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమాలలో ప్రాతఃకాల ఆరాధన, నిత్యార్చన, హోమము, విశేష హోమము, బలిహరణం తదితర కార్యక్రమాలను వేద పండితులు వేదోక్తంగా గావించారు. సాయంత్రం నిర్వహించిన కార్యక్రమాలలే హోమము, సహస్ర దీపాలంకరణసేవ వేద పండితులు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. కార్యక్రమాలలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించి తరించారు. కార్యక్రమాలను ఆలయ కార్య నిర్వాహక అధ్యక్షుడు పడుచూరి వెంకటేశ్వర్లు, వ్యవస్థాపక కార్యదర్శి పాతకోట బ్రహ్మణయ్య నాయుడు, కార్యదర్శులు దాసరి భాస్కరరావు తదితరులు పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement