Friday, May 3, 2024

రామిరెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

వినుకొండ : మండలం రామిరెడ్డి పాలెం వద్ద ఈరోజు తెల్లవారుజామున నవత ట్రాన్స్ పోర్ట్ వాహనం – అశోక్ లైలాండ్ వాహనం ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ట్రాన్స్ పోర్ట్ వాహనం డ్రైవర్ మృతి చెందినట్లు సమాచారం. అశోక్ లైలాండ్ వాహనంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. అయితే ఈ వాహనంలో వ్యక్తులెవ‌రూ లేకపోవడంతో గాయాలతో ఆసుపత్రికి వెళ్లారా… లేక ప్రమాదంలో రేషన్ బియ్యం బయట పడటంతో పరారయ్యారా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెండు రోజుల క్రితం వినుకొండ మండలం చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను విజిలెన్స్ అధికారులు ప‌ట్టుకున్న విష‌యం విదిత‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement