Friday, May 10, 2024

పింగ‌లి వెంక‌య్య‌కు భార‌త ర‌త్న – ప‌వ‌న్ క‌ల్యాణ్ డిమాండ్..

అమరావతి: భార‌త దేశ జాతీయ ప‌తాక రూప‌క‌ర్త పింగ‌లి వెంక‌య్య‌కు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కేంద్రాన్ని కోరారు.. జాతీయ ప‌తాకం రూపు దిద్దుకుని వందేళ్ల పూర్త‌యిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ప‌వ‌న్ మాట్లాడుతూ మన జాతీయ పతాకం దేశ ఔన్నత్యానికి సగర్వ సంకేతమని అన్నారు. పింగళి వెంకయ్యకి భారతరత్న ఇవ్వాలని అంటూ, ఊరూరా విగ్రహాలు నెలకొల్పాలని సూచించారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలించింది మువ్వన్నెల జెండా అన్నారు. మన దేశ ఔన్నత్యానికి, సమరవీరుల త్యాగఫలానికి సగర్వ సంకేతంగా నిలుస్తుందని పేర్కొన్నారు. జాతీయ పతాకం రెపరెపలు మొదలై నేటికి శత వసంతాలు పూర్తి కావడం, ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన మధుర క్షణాలని జ‌న‌సేనాని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement