Friday, April 26, 2024

బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా యలవల నరేష్

బాపట్ల – బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యలవల నరేష్ బాబు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి భీమ లీలాకృష్ణ అన్నారు.బాపట్ల బార్ అసోసియేషన్ 2021,22 సంవత్సరం కు జరిగిన ఎన్నికలలో న్యాయవాది కె కొర్నేలియా పై అధ్యక్షుడిగా యలవల నరేష్ బాబు 44 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.మిగిలిన కార్యవర్గాన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.ఉపాధ్యక్షుడిగా ఇమ్మడిశెట్టి సురేష్ బాబు,ప్రధాన కార్యదర్శిగా బిళ్ళ కమల్ కుమార్,జాయింట్ సెక్రటరీగా ఎం శ్యామలాదేవి,కోశాధికారిగా ఉషారాణి,లైబ్రరీ సెక్రటరీగా డేగల రాజారావు,క్రీడలు సాంస్కృతిక కార్యదర్శి గా సి ప్రేమ్ చంద్,మహిళా ప్రతినిధి గా జియస్ యన్ మోహినితో పాటు,మరో 20 మందిని కార్యవర్గ సభ్యులగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement