Wednesday, May 15, 2024

‘ది ప్రాంటియర్‌’ పుస్తకాన్ని ఆవిష్క‌రించిన జ‌గ‌న్

అమ‌రావ‌తి … సీనియర్‌ జర్నలిస్ట్‌ రెహనా రచించిన ‘ది ప్రాంటియర్‌’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా ‘ది ప్రాంటియర్‌’ పుస్తకాన్ని విడుద‌ల చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకకృష్ణారెడ్డి, ప్రభుత్వ మీడియా సలహాదారు జీవీడీ కృష్ణమోహన్, సమాచారశాఖ కమిషనర్‌ టి. విజయ్‌కుమార్‌ రెడ్డి, సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement