Wednesday, May 1, 2024

మాజీ మంత్రి మహ్మద్‌ జానీ క‌న్నుమూత‌…

గుంటూరు : సీనియర్ నాయ‌కుడు, మాజీ మంత్రి మహ్మద్‌ జానీ (74) గుండెపోటుతో కన్నుమూశారు. కాంగ్రెస్ లో పాతతరం నాయకుడిగా పేరొందిన జానీ 1985, 1989లో గుంటూరు-1 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989 నుంచి 1993 వరకు యువజన సర్వీసులు, చిన్నపరిశ్రమలు, చక్కర శాఖల మంత్రిగా పనిచేశారు. 2006లో వైఎస్‌ రాజశేఖరెడ్డి హయాంలో ఎమ్మెల్సీగా ఎన్నికై నాలుగేళ్ల పాటు శాసనమండలి డిప్యూటి ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2010లో ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో తిరిగి శాసనమండలికి ఎన్నికై 2016 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2017లో టీడీపీలో చేరి రెండేళ్ల పాటు టీడీపీలో కొనసాగారు. తిరిగి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. ఆయన మ‌రణం ప‌ట్ల ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement