Friday, May 17, 2024

26భార‌త్ బంద్ కు కాంగ్రెస్‌ మద్దతు

అమ‌రావ‌తి – భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఇస్తోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను, రైతు వ్యతిరేక వ్యవసాయ అనుబంధ చట్టాలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఓ ప్రకటనలో వెల్లడించారు. బీజేపీ సర్కారు విధానాలను వ్యతిరేకిస్తూ కిసాన్‌ సంయుక్త మోర్చా, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ కమిటీ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదికలు సంయుక్తంగా పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement