Friday, May 3, 2024

Breaking: నిర్మాణ పనుల్లో మట్టిపెళ్లలు ప‌డి : ఒకరు మృతి

భవన నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా మ‌ట్టిపెళ్ల‌లు మీద ప‌డి ఒక‌రు మృతిచెంద‌గా, ప‌లువురు మ‌ట్టిపెళ్ల‌ల కింద ఇరుక్కున్న ఘ‌ట‌న గుంటూరులో చోటుచేసుకుంది. గుంటూరులో బహుళ అంతస్తుల భవనం కోసం పునాదులు తవ్వుతుండగా ఘటన జ‌రిగింది. గుంటూరు అమరావతి రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్‌లో ఘటన ఈ ప్ర‌మాదంలో మట్టిపెళ్లల కింద చిక్కుకున్న మరో కూలీ కోసం సహాయచర్యలు చేప‌ట్టారు. కూలీలు బీహార్ కు చెందిన వారుగా గుర్తించారు. భవన నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. బహుళ అంతస్తుల భవనం పునాది కోసం 40 అడుగుల మేర తవ్వకాలు జ‌రిపారు. మట్టిపెళ్లలు విరిగిపడుతుండటంతో అప్రమత్తమై ఇద్దరు కూలీలు త‌ప్పుకున్నారు. సహాయచర్యల్లో తోటి కూలీలు ఒకరిని ప్రాణాలతో కాపాడారు. మ‌ట్టిపెళ్ల‌ళ్ల కింద ఇరుక్కున్న వారిని బ‌య‌ట‌కు తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement