Sunday, May 5, 2024

గృహసారధులే వైకాపా రథసారథులు

మేడికొండూరు ఫిబ్రవరి 20(ప్రభాస్ న్యూస్) మండల పరిధిలోని పేరేచర్ల లోని సాయి కృష్ణ కళ్యాణమండపంలో అతిథిగా బత్తుల బ్రహ్మారెడ్డి , కత్తెర సురేష్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను, పాలన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత గృహసారథులు, కన్వీనర్లు, వాలంటీర్ల పై ఉందని తాడికొండ నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ కత్తెర సురేష్ కుమార్ గారు పేర్కొన్నారు. మేడికొండూరు మండలం పేరిచర్ల లోని షిరిడి సాయి కళ్యాణ మండపంలో జరిగిన మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో భాగంగా కన్వీనర్లు, గృహ సారధులు ,వాలంటీర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమంలో శ్రీ కత్తెర సురేష్ కుమార్ గారు పాల్గొని మాట్లాడారు .ఎవరు చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరు లబ్ధిపొందేలా చర్యలుతీసుకున్నారని తెలిపారు.

ప్రతి పథకం గురించి లబ్ధిదారులకు, ప్రజలకు వివరించాలని, అందరికీ అందేలా చూడాలని కుల,మత ప్రాంతాలకతీతంగా అందరికీ న్యాయం చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు .తాడికొండ నియోజకవర్గ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ నాయకుడు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ఏ బేధం లేకుండా అందరికీ అందేలా చూస్తున్నారని, దీనికి ఓర్చుకోలేక ప్రతిపక్షాలు అనవసరమైన విమర్శలు చేస్తున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్య మంత్రి ప్రవేశపెట్టనన్ని సంక్షేమ పథకాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్నారని ఈ విషయంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను స్క్రీన్ పై ప్రదర్శించి వివరించారు .కార్యక్రమంలో మేడికొండూరు ఎంపీపీ మనవ స్వప్న రాజేష్ ,జడ్పిటిసి కందుల సిద్దయ్య మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి వంశీకృష్ణ ,వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ బాజీ, వేదికపై ఉండగా ఇంకా ఎంపీటీసీలు సర్పంచులు పార్టీ నాయకులు గృహ సారధులు మండల కన్వీనర్లు వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement