Wednesday, May 15, 2024

క‌డుపు మీద కొట్టి సాధించిన‌ విజ‌యం – వైసిపి గెలుపుపై ప‌వ‌న్ క‌ల్యాణ్…

అమ‌రావ‌తి – న‌గ‌ర పాల‌క సంస్థ‌లు, మునిసిపల్ ఎన్ని క‌ల‌లో ప్ర‌జ‌ల కడుపు మీద కొట్టి వైసిపి విజ‌యం సాధించింద‌ని వ్యాఖ్యానించారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువెడుతున్న నేప‌థ్యంలో ఆయ‌న ఒక ప్ర‌క‌టన విడుద‌ల చేశారు..కడుపుమీద కొట్టి,తిండి లాక్కుంటామని బెదిరించి వైకాపా ఓట్లు సాధించిందని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. వైకాపాకు ఓటెయ్యకపోతే సంక్షేమ పథకాలు, రైషన్ కార్డులు, పింఛన్లు, విద్యా పథకాలు ఆపేస్తామని బెదిరించారని మండిపడ్డారు. బెదిరింపులతోనే వైకాపా ఎక్కువ స్థానాల్లో గెలిచిందని ఆరోపించారు. వైకాపా భరోసా ఇచ్చి ఓట్లు సాధించలేదని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement