Tuesday, May 7, 2024

Guntupalli – ఆటో బోల్తా …డాన్ బోస్కో విద్యార్థిని మృతి ..

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గుంటుపల్లి – డాన్ బోస్కో స్కూల్ నుండి వెళ్తుండగా గుంటుపల్లి వద్ద ఘటన చోటుచేసుకుంది….వి ద్యార్థులను తీసుకువెళ్లే ఆటో ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి బోల్తా కొట్టింది.. ఈ ప్రమాదం లో డాన్ బాస్కో స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న నవ్య శ్రీ మృతి చెందింది.. మ‌రో 14మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి…..

గుంటుపల్లి డాన్ బాస్కో స్కూల్ విద్యార్థులు సెంట్రల్ సిలబస్ సి.బి.ఎస్.ఇ. విద్యార్థులతో విజయవాడవైపు భవానీ పురం,
పరిసరప్రాంతాలనుండి వచ్చే విద్యార్థులను తీసుకుని వెళ్తుండగా గుంటుపల్లి వద్ద ఘటన చోటుచేసుకుంది…. ఈప్రమాదంలో ఇద్దరు పిల్లల కు కాళ్ళు చేతులు విరిగాయంటున్న స్థానికులు. మరోఇద్దరి పిల్లల కు సీరియస్ మిగిలిన వారికి గాయాలయ్యాయి.. గాయపడిన చిన్నారులను ఇబ్రహీంపట్నం పోలీసులు గొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement