Wednesday, May 1, 2024

Gunadala మేరీ మాత చ‌ర్చిని సంద‌ర్శించిన చంద్ర‌బాబు …

విజ‌య‌వాడ – తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గుణదల మేరీమాత చర్చికి వెళ్లారు. చర్చిలో ప్రార్థనలు చేశారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులకు చర్చి ఫాదర్‌లు ఆశీర్వనచనం అందజేశారు. అనంతరం మేరిమాత విగ్రహాన్ని అందజేశారు…

అంత‌కు ముందు విశాఖపట్నం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి గుణదల వెళ్లారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని అన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అని పేర్కొన్నారు.. నవశకం ప్రారంభమైందని యువగళం ప్రపంచానికి చాటింది అని అన్నారు… రాష్ట్రానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం అని , . దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీని టీడీపీ-జనసేన కూటమి పునర్‍నిర్మిస్తుంది అని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement